Telugu Global
NEWS

రాంచరణ్‌ ఆఫీస్‌ ముందు ఉయ్యాలవాడ కుటుంబం ధర్నా

హీరో రాంచరణ్ ఇంటి ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. షూటింగ్ సమయంలో తన పొలాలను నాశనం చేసి అందుకు నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేశారని ఆరోపిస్తున్నారు. శనగపంట పొలాల్లో షూటింగ్ చేసి.. పంటలను నాశనం చేశారని… ఆ సమయంలో నష్టపరిహారం చెల్లిస్తామంటూ ఒప్పందం కూడా చేసుకున్నారని చెబుతున్నారు. కానీ షూటింగ్ ముగిసిన తర్వాత ఒప్పందం చెల్లదంటూ మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే సెక్యూరిటీతో బయటకు గెంటివేయిస్తున్నారని […]

రాంచరణ్‌ ఆఫీస్‌ ముందు ఉయ్యాలవాడ కుటుంబం ధర్నా
X

హీరో రాంచరణ్ ఇంటి ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. షూటింగ్ సమయంలో తన పొలాలను నాశనం చేసి అందుకు నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

శనగపంట పొలాల్లో షూటింగ్ చేసి.. పంటలను నాశనం చేశారని… ఆ సమయంలో నష్టపరిహారం చెల్లిస్తామంటూ ఒప్పందం కూడా చేసుకున్నారని చెబుతున్నారు. కానీ షూటింగ్ ముగిసిన తర్వాత ఒప్పందం చెల్లదంటూ మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే సెక్యూరిటీతో బయటకు గెంటివేయిస్తున్నారని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు చెబుతున్నారు.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి హీరోగా రాంచరణ్ సినిమా నిర్మిస్తున్నాడు. షూటింగ్ ను ఉయ్యాలవాడ పొలాల్లో తీశారు. ఆ సమయంలో పంటలు నాశనం అయ్యాయి. అందుకు నష్టపరిహారం ఇస్తామన్న చిత్ర యూనిట్ ఇప్పుడు ముఖం చాటేసింది.

First Published:  30 Jun 2019 6:53 AM GMT
Next Story