Telugu Global
NEWS

ఈ ఫొటో వెనుక అసలు నిజం....

టీడీపీ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో… చంద్రబాబు ఏపీలో లేని పరిస్థితుల్లో…. టీడీపీ నేతలు తమకు తోచిన అస్త్రాలను ప్రయోగించేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఫోటోను తెరపైకి తెచ్చారు. అరెస్ట్‌లకు భయపడి సుజనా, సీఎం రమేష్ పార్టీ ఫిరాయిస్తే వారితో విజయసాయిరెడ్డి ఎందుకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు? విందులు చేసుకుంటున్నారు అంటూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఒక ఫోటోను ప్రదర్శించారు. ఆ ఫోటోలో విజయసాయిరెడ్డి, సీఎం రమేష్, […]

ఈ ఫొటో వెనుక అసలు నిజం....
X

టీడీపీ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో… చంద్రబాబు ఏపీలో లేని పరిస్థితుల్లో…. టీడీపీ నేతలు తమకు తోచిన అస్త్రాలను ప్రయోగించేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఫోటోను తెరపైకి తెచ్చారు.

అరెస్ట్‌లకు భయపడి సుజనా, సీఎం రమేష్ పార్టీ ఫిరాయిస్తే వారితో విజయసాయిరెడ్డి ఎందుకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు? విందులు చేసుకుంటున్నారు అంటూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఒక ఫోటోను ప్రదర్శించారు. ఆ ఫోటోలో విజయసాయిరెడ్డి, సీఎం రమేష్, సుజనాచౌదరి ముగ్గురు ఒకే చోట కూర్చుని భోజనం చేస్తున్నట్టుగా ఉంది.

అయితే ఈ ఫోటో టీడీపీ నేతలు చెబుతున్నట్టు ముగ్గురు ఎంపీలు రహస్యంగా విందులు చేసుకున్నది కాదు. గురువారం వెంకయ్యనాయుడు ఎంపీలకు విందు ఇచ్చారు. ఆ విందులకు అందరు ఎంపీలతో పాటు విజయసాయిరెడ్డి, సీఎం రమేష్, సుజనాచౌదరి హాజరయ్యారు.

తొలుత విజయసాయిరెడ్డి అక్కడికి రాగానే ఆ తర్వాత వచ్చిన సీఎం రమేష్, సుజనాచౌదరిలు విజయసాయిరెడ్డి కుర్చీకి పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. అప్పుడు అక్కడ వెంకయ్యనాయుడుతో పాటు అనేక మంది ఎంపీలున్నారు.

కానీ టీడీపీ నేతలు తెలివిగా కేవలం ముగ్గురు మాత్రమే కనిపించేలా ఫోటోను ప్రచారంలో పెట్టారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో పాటు విజయసాయిరెడ్డికి కూడా బీజేపీతో సంబంధాలున్నాయన్న ప్రచారం చేసి వైసీపీకి కూడా కాస్త బురద అంటించే ప్రయత్నం చేశారు.

First Published:  22 Jun 2019 8:05 AM GMT
Next Story