Telugu Global
NEWS

వెంకయ్యా... మరో కోడెల కావొద్దు... చరిత్రహీనుడిగా మిగలొద్దు

టీడీపీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి ప్రజాస్వామిక విలువలను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. తమను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా వెంకయ్యనాయుడిని కోరుతూ ఫిరాయింపు ఎంపీలు లేఖలు ఇచ్చిన నేపథ్యంలో రామకృష్ణ … నేరుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లేఖ రాశారు. ఫిరాయింపుదారులను బీజేపీలో విలీనం చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండా… స్వార్థపూరితంగా సొంతంగా ఎంపీలు […]

వెంకయ్యా... మరో కోడెల కావొద్దు... చరిత్రహీనుడిగా మిగలొద్దు
X

టీడీపీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి ప్రజాస్వామిక విలువలను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. తమను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా వెంకయ్యనాయుడిని కోరుతూ ఫిరాయింపు ఎంపీలు లేఖలు ఇచ్చిన నేపథ్యంలో రామకృష్ణ … నేరుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లేఖ రాశారు.

ఫిరాయింపుదారులను బీజేపీలో విలీనం చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండా… స్వార్థపూరితంగా సొంతంగా ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. చంద్రబాబు ప్రొద్బలంతో ఏపీలో గత స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేసిన రామకృష్ణ… పరోక్షంగా వెంకయ్యనాయుడును మరో కోడెల శివప్రసాదరావులా మిగిలిపోకూడదని ఆకాంక్షించారు.

ఫిరాయింపులకు వ్యతిరేకంగా వివిధ సందర్భాల్లో వెంకయ్యనాయుడు చేసిన స్పూర్తి ప్రసంగాలను కూడా లేఖలో రామకృష్ణ గుర్తు చేశారు. ఫిరాయింపుదారుల పదవులు తక్షణం పోయేలా చేయాలని ప్రసంగాల్లో చెప్పిన వెంకయ్యనాయుడు… ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఫిరాయింపు టీడీపీ ఎంపీలపై వేటు వేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలన్నారు. లేకుంటే వెంకయ్యనాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

First Published:  21 Jun 2019 3:50 AM GMT
Next Story