Telugu Global
NEWS

మంగళగిరిలో కట్టలతో బుసలు కొడుతున్న లోకేష్... !

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మంగళగిరి స్థానం నిలిచేలా ఉంది. మంగళగిరిలో పరిణామాలు చూసి స్థానికులే ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ బరిలో ఉండడంతో టీడీపీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తమ భావినాయకుడిని గెలిపించుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలైనట్టు చెబుతున్నారు. ఓటుకు 10వేల రూపాయలు పంచేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే డబ్బు ప్రవాహం మొదలైంది. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే గెలుపు లక్ష్యమని […]

మంగళగిరిలో కట్టలతో బుసలు కొడుతున్న లోకేష్... !
X

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మంగళగిరి స్థానం నిలిచేలా ఉంది. మంగళగిరిలో పరిణామాలు చూసి స్థానికులే ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ బరిలో ఉండడంతో టీడీపీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

తమ భావినాయకుడిని గెలిపించుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలైనట్టు చెబుతున్నారు. ఓటుకు 10వేల రూపాయలు పంచేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే డబ్బు ప్రవాహం మొదలైంది. ఎన్ని కోట్లు
ఖర్చు అయినా సరే గెలుపు లక్ష్యమని టీడీపీ నాయకత్వం ప్రకటించడంతో మంగళగిరిలో తొలివిడత డబ్బు పంపిణీ మొదలైందని చెబుతున్నారు.

ఓటుకు 10వేల రూపాయలు మంగళగిరిలో ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్టు సమాచారం. డబ్బుతో పాటు స్మార్ట్‌ ఫోన్లను కూడా పంచుతున్నారు. వివిధ వర్గాలకు పలు తాయిలాలతో గాలం వేస్తున్నారు.

మహిళలకు చీరలు, బంగారం, వెండి పంచేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ వీటిని జనం తీసుకుని తెలివిగా ఓటేయకుండా హ్యాండ్ ఇస్తారేమోనన్న ఆందోళన కూడా ఒకవైపు టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

First Published:  18 March 2019 11:23 PM GMT
Next Story