Telugu Global
NEWS

మోదుగుల డుమ్మా....

గుంటూరు జిల్లాలో టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు నిర్వహించిన భేటీకి మోదుగుల హాజరుకాలేదు. కొంతకాలంగా చంద్రబాబుపై మోదుగుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి ఇస్తానన్న హామీతో గత ఎన్నికల్లో ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థానానికి మోదుగులను చంద్రబాబు తీసుకొచ్చారు. అప్పటి వరకు మోదుగుల ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట ఎంపీ స్థానాన్ని […]

మోదుగుల డుమ్మా....
X

గుంటూరు జిల్లాలో టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు నిర్వహించిన భేటీకి మోదుగుల హాజరుకాలేదు.

కొంతకాలంగా చంద్రబాబుపై మోదుగుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి ఇస్తానన్న హామీతో గత ఎన్నికల్లో ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యే స్థానానికి మోదుగులను చంద్రబాబు తీసుకొచ్చారు.

అప్పటి వరకు మోదుగుల ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట ఎంపీ స్థానాన్ని రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు కేటాయించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదుగులకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు.

ఫిరాయింపుదారులకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా… పార్టీ కోసం పనిచేసే వారికి చంద్రబాబు ఇవ్వడం లేదని మోదుగుల ఆగ్రహంగా ఉన్నారు.

First Published:  2 March 2019 11:05 PM GMT
Next Story