Telugu Global
NEWS

తలసానితో తోట భేటీ కలకలం....

ఏపీ టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ కలకలం రేపుతోంది. కొంతకాలంగా తోట టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తలసాని, తోట భేటీతో టీడీపీలో చర్చ జరుగుతోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ మార్పుపైనా చర్చ జరిగినట్టు సమాచారం. తోట మాత్రం కేవలం మర్యాదపూర్వకంగానే తాము కలిసినట్టు […]

తలసానితో తోట భేటీ కలకలం....
X

ఏపీ టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ కలకలం రేపుతోంది.

కొంతకాలంగా తోట టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తలసాని, తోట భేటీతో టీడీపీలో చర్చ జరుగుతోంది.

ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ మార్పుపైనా చర్చ జరిగినట్టు సమాచారం. తోట మాత్రం కేవలం మర్యాదపూర్వకంగానే తాము కలిసినట్టు చెబుతున్నారు.

మంత్రి పదవి కూడా దక్కడంతో అభినందించేందుకు తాను వచ్చానన్నారు. అయితే చంద్రబాబును తలసాని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, ఇప్పటికే తోట త్రిమూర్తులకు సన్నిహితుడైన ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరడం వంటి పరిణామాలను బేరీజు వేస్తే తోట కూడా టీడీపీని వీడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

First Published:  20 Feb 2019 8:37 PM GMT
Next Story