Telugu Global
NEWS

‘సత్యం’ స్కాం.... సెబీ సంచలన తీర్పు

ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన సత్యం రామలింగరాజును సెబీ విడవటం లేదు. తాజాగా మరో తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని రామలింగరాజు, అతని సోదరులపై నిషేధం విధించింది. రూ.813 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన రామలింగరాజు, అంతే స్థాయిలో దిగజారిపోయారు. […]

‘సత్యం’ స్కాం.... సెబీ సంచలన తీర్పు
X

ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన సత్యం రామలింగరాజును సెబీ విడవటం లేదు. తాజాగా మరో తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని రామలింగరాజు, అతని సోదరులపై నిషేధం విధించింది. రూ.813 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

హైదరాబాద్ నగరంలో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన రామలింగరాజు, అంతే స్థాయిలో దిగజారిపోయారు.

సత్యం కుంభకోణం అప్పుడు ఓ సంచలనంగా మారింది. ఎన్నో వాయిదాల అనంతరం సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు, అతని సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు తదితరులకు కోర్టు జైలు శిక్ష విధించింది. సెబీ ఆయన కంపెనీలపై నిషేధం విధించింది. వేలాది మంది ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాట పట్టారు. ఇదంతా జరిగి 10 ఏళ్లు కావస్తుంది.

తాజాగా సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ప్రభృతులపై 14 ఏళ్ల పాటు నిషేధం విధించింది. మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. కాగా, గతంలో ఆదేశించిన 1258.88 కోట్ల మొత్తాన్ని ఇప్పుడు రూ.813.40 కోట్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ కంపెనీ రూ.675 కోట్లు, రామలింగరాజు రూ.27కోట్లు, సూర్య నారాయణరాజు 82 కోట్లు, రామరాజు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009 జనవరి నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

First Published:  3 Nov 2018 12:20 AM GMT
Next Story