Telugu Global
NEWS

జగన్‌ హత్యకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తే ఇలా ఉండదు

జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మర్డర్ ప్లాన్‌ చేస్తే ఇలా ఉండదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్‌ను చంపాలనుకుంటే చంద్రబాబు ఇలా పిల్ల కుంకతో ప్లాన్‌ చేస్తాడా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. తాము మర్డర్ ప్లాన్‌ చేస్తే ఇలా చిన్న కత్తులతో గుచ్చుకోవడాలు, గిచ్చుకోవడాలు ఉండవని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అర సెంటీమీటర్‌ గాయానికి ఏకంగా గవర్నర్‌ విచారణ చేయడం అవసరమా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒక గవర్నర్‌ […]

జగన్‌ హత్యకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తే ఇలా ఉండదు
X

జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మర్డర్ ప్లాన్‌ చేస్తే ఇలా ఉండదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. జగన్‌ను చంపాలనుకుంటే చంద్రబాబు ఇలా పిల్ల కుంకతో ప్లాన్‌ చేస్తాడా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. తాము మర్డర్ ప్లాన్‌ చేస్తే ఇలా చిన్న కత్తులతో గుచ్చుకోవడాలు, గిచ్చుకోవడాలు ఉండవని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

అర సెంటీమీటర్‌ గాయానికి ఏకంగా గవర్నర్‌ విచారణ చేయడం అవసరమా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒక గవర్నర్‌ ఒకే రాష్ట్రంలో 12 ఏళ్ల పాటు ఉండడం ఎక్కడైనా జరిగిందా అని మండిపడ్డారు. నరసింహన్‌ పై కేంద్రానికి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు.

గాయమైన తర్వాత కుట్లు వేయించుకోడానికి విశాఖలో డాక్టర్లు లేరా నేరుగా హైదరాబాద్‌ పోవాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్‌పై దాడి ఘటనలో సీబీఐతో కాకుండా ఈడీ, కేవీ చౌదరి ఆధ్వర్యంలోని సీవీసీతో విచారణ జరుపుకోవాలన్నారు. జగన్‌పై దాడి కేంద్రం అమలుచేస్తున్న డ్రామాలో భాగంగానే జరిగిందన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు.

సోమిరెడ్డి వ్యాఖ్యలను రోజా ఖండించారు. ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డిని చంద్రబాబు ఇలాంటి విషయాలకు పనికొస్తారనే మంత్రిని చేశారని మండిపడ్డారు. సోమిరెడ్డికి సోది మాట్లాడడం తప్ప ఏమైనా తెలుసా అని నిలదీశారు.

First Published:  26 Oct 2018 4:30 AM GMT
Next Story