Telugu Global
NEWS

వామ్మో గీత... ఇన్ని వేషాలా... బాబుగారి పత్రిక కూడా

అధికారాన్ని అడ్డుపెట్టుకుని, డిప్యూటీ కలెక్టర్ హోదాలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత సాగించిన వికృత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా రూ. 5వేల కోట్ల రూపాయల విలువైన భూమిని మింగేందుకు భర్తతో కలిసి కొత్తపల్లి గీత చేసిన విన్యాసాలు చట్టాలకే సవాల్ విసురుతున్నాయి. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పాన్‌ మక్తాలో ఏకంగా 99.07 ఎకరాలను కాజేశారు గీత. ఇక్కడ ఎకరం భూమి విలువ 50కోట్లు ఉంది. అవినీతి గీతకు అక్రమాలను ప్రోత్సహించే మొగుడు కూడా […]

వామ్మో గీత... ఇన్ని వేషాలా... బాబుగారి పత్రిక కూడా
X

అధికారాన్ని అడ్డుపెట్టుకుని, డిప్యూటీ కలెక్టర్ హోదాలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత సాగించిన వికృత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా రూ. 5వేల కోట్ల రూపాయల విలువైన భూమిని మింగేందుకు భర్తతో కలిసి కొత్తపల్లి గీత చేసిన విన్యాసాలు చట్టాలకే సవాల్ విసురుతున్నాయి.

హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పాన్‌ మక్తాలో ఏకంగా 99.07 ఎకరాలను కాజేశారు గీత. ఇక్కడ ఎకరం భూమి విలువ 50కోట్లు ఉంది. అవినీతి గీతకు అక్రమాలను ప్రోత్సహించే మొగుడు కూడా తోడవడంతో తెగించి వ్యవహారం నడిపారు. ఎప్పుడో కనుమరుగైన భావన సొసైటీని మళ్లీ సృష్టించిన కొత్తపల్లి గీత 1982 మార్చిలోనే తాను భూమిని కొన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించింది. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఈమెకు అప్పట్లో అడ్డుఅదుపులో లేకుండాపోయింది. ఇలా 99.07 ఎకరాలను గీత కాజేసింది. ఇటీవల 46 ఎకరాలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో కొత్తపల్లి గీత గావుకేకలు వేశారు.

హైదరాబాద్‌లో తన ఆస్తులకు రక్షణ లేకుండాపోయిందంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. అయితే అందంతా బుకాయింపే. కొత్తపల్లి గీత సృష్టించిన పత్రాలు ఫేక్ అని సీబీఐ, సీఐడీ నిర్ధారించాయి. సంతకాలు ఫోర్జరీ చేసినట్టు నిర్థారించాయి. అంతే కాదు కొత్తపల్లి గీత రెండు పాన్‌కార్డులను కూడా వాడుతున్నారు. అక్రమాలకు ఒకటి, సక్రమాలకు ఒకటి అన్న మాట. ఈ విషయంలో విచారణలో బయటపడింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే… వైసీపీ తరపున అరకు నుంచి గెలిచిన కొత్తపల్లి గీత .. ఆ పార్టీ అధికారంలోకి రాకపోయే సరికి టీడీపీలో చేరారు. అధికార పార్టీ అండ ఉంటే తన అక్రమాలకు ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతోనే ఆమె అలా చేశారు.

అయితే తెలంగాణలో ఆమె ఎత్తులు పారడం లేదు. చంద్రబాబు అనుకూల పత్రిక కూడా కొత్తపల్లి గీత 5వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ప్రముఖంగా కథనం రాసింది. దీంతో ఇప్పుడు ఇలాంటి అత్యంత అవినీతిపరురాలైన ఎంపీపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో!. లేకుంటే ఎప్పటిలాగే తన దగ్గర ఉన్న కోటి లింగాలలో ఒక బోడిలింగం అన్నట్టు లైట్ తీసుకుంటారో!.

Click on Image to Read:

uma-reddy-venkateswarlu

polavaram-chandrababu-naidu

balakrishna-firing

First Published:  16 Sep 2016 11:23 PM GMT
Next Story