Telugu Global
Cinema & Entertainment

నాగార్జున సీటు లాగేసుకున్న మెగాస్టార్

మీలో ఎవరు కోటీశ్వరుడు పేరు చెప్పగానే నాగార్జున పేరు గుర్తుకొస్తుంది. వరుసగా 3 సీజన్ల పాటు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టించిన ఘనత మన్మధుడిదే. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు.. బుల్లితెరపై అత్యథిక వ్యూవర్ షిప్ కలిగిన మహిళా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంలో నాగ్ వందకు 2వందల శాతం సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు మేనేజ్ మెంట్ మాత్రం నాగ్ పై వేటు వేసింది. వరుసగా 3 సీజన్లు చేసిన నాగ్ ను ఆ షో నుంచి తప్పించింది. […]

నాగార్జున సీటు లాగేసుకున్న మెగాస్టార్
X

మీలో ఎవరు కోటీశ్వరుడు పేరు చెప్పగానే నాగార్జున పేరు గుర్తుకొస్తుంది. వరుసగా 3 సీజన్ల పాటు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టించిన ఘనత మన్మధుడిదే. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు.. బుల్లితెరపై అత్యథిక వ్యూవర్ షిప్ కలిగిన మహిళా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంలో నాగ్ వందకు 2వందల శాతం సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు మేనేజ్ మెంట్ మాత్రం నాగ్ పై వేటు వేసింది. వరుసగా 3 సీజన్లు చేసిన నాగ్ ను ఆ షో నుంచి తప్పించింది. ఆ స్థానంలో చిరంజీవిని పెట్టింది.

స్టార్ గ్రూప్ నకు చెందిన మాటీవీలో ఈ షోను ఇకపై చిరంజీవి నిర్వహించనున్నారు. ప్రస్తుతం 150వ సినిమా పనిలో బిజీగా ఉన్న చిరంజీవి… డిసెంబర్ నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ అత్యంత ఆకర్షణీయంగా జరగబోతోందని సమాచారం. షో ప్రారంభం అయిన వెంటనే… నాగార్జున వచ్చి ఈ రోజు నుంచి నా స్థానంలో చిరంజీవి ఉంటారంటూ పరిచయం చేస్తూ… తన సీటులో చిరంజీవిని కూర్చోబెడతారట. ఆ తర్వాత హాట్ సీట్ లో నాగార్జున కూర్చుంటాడట. ఇద్దరూ కలిసి ఖైదీ నంబర్-150, ఓం నమో వేంకటేశాయ సినిమాల గురించి మాట్లాడుకుంటారట. ఎందుకంటే… ఈ రెండు సినిమాలు షో ప్రసారమయ్యే టైమ్ కు విడుదల అవుతాయి. అలా మొదటి ఎపిసోడ్ ముగిసిన తర్వాత… రెండో ఎపిసోడ్ నుంచి చిరు వ్యాఖ్యాతగా మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్-4 ప్రారంభం అవుతుందట.

First Published:  7 Sep 2016 10:08 PM GMT
Next Story