Telugu Global
Cinema & Entertainment

ఇక  వ‌ర‌స ప్రాజెక్ట్ ల‌తో  మాస్ రాజా..!

మాస్‌ హీరోగా తిరుగులేని మార్కెట్‌ ఉన్న రవితేజ తీసుకుంటున్న విరామం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ ప్రేక్షకులకు వినోదం పంచుతూ.. మంచి హిట్స్ అందుకున్న హీరో రవితేజ. గతంలో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేవారు. ఆ తర్వాత రెండు.. ఇప్పుడు ఒకటి. ఎప్పటికప్పుడు సినిమా సినిమాకీ గ్యాప్ లేకుండా చూసుకోవాలని రవితేజ అనుకుంటున్నప్పటికీ ఎందుకనో గ్యాప్ వచ్చేస్తోంది., గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ‘బెంగాల్ టైగర్’ తర్వాత ఈ మాస్ హీరో ఇప్పటి వరకూ […]

ఇక  వ‌ర‌స ప్రాజెక్ట్ ల‌తో  మాస్ రాజా..!
X

మాస్‌ హీరోగా తిరుగులేని మార్కెట్‌ ఉన్న రవితేజ తీసుకుంటున్న విరామం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ ప్రేక్షకులకు వినోదం పంచుతూ.. మంచి హిట్స్ అందుకున్న హీరో రవితేజ. గతంలో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేవారు. ఆ తర్వాత రెండు.. ఇప్పుడు ఒకటి. ఎప్పటికప్పుడు సినిమా సినిమాకీ గ్యాప్ లేకుండా చూసుకోవాలని రవితేజ అనుకుంటున్నప్పటికీ ఎందుకనో గ్యాప్ వచ్చేస్తోంది., గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ‘బెంగాల్ టైగర్’ తర్వాత ఈ మాస్ హీరో ఇప్పటి వరకూ మేకప్ వేసుకోలేదు.

దర్శక-నిర్మాతలెవరూ రవితేజ దగ్గరికి వెళ్లడం లేదా.. అంటే అదీ కాదు. ఆయనతో సినిమా తీయాలని ప్రయత్నించే దర్శక-నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ ఏ ప్రయత్నమూ ముందుకు సాగతం లేదు. అయితే ఇప్పుడు తాజా వార్తల ప్రకారం ‘లక్ష్మీ’, ‘లక్ష్యం’, ‘రేసు గుర్రం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు.

ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసు గుర్రం’ చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు.

First Published:  6 Sep 2016 11:21 AM GMT
Next Story