Telugu Global
Cinema & Entertainment

ఆటాడుకుందాం రా అంటున్న అక్కినేని బ్రదర్స్

సుశాంత్ హీరోగా నటించిన మూవీ ఆటాడుకుందాం రా. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటల్ని తాజాగా విడుదల చేశారు. ఏఎన్నార్ సూపర్ హిట్ మూవీలోంచి పల్లెకు పోదాం..పారును చూద్దాం చలోచలో అనే పాట రీమిక్స్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. మనం సినిమాలో అక్కినేనికి చెందిన ఓ పాటను రీమిక్స్ చేసిన అనూప్ రూబెన్స్… ఆటాడుకుందాం రాలో కూడా తన రీమిక్స్ మేజిక్ ను చూపించాడు. ఇదిలా ఉండగా… తాజాగా వచ్చిన ఓ రూమర్.. […]

ఆటాడుకుందాం రా అంటున్న అక్కినేని బ్రదర్స్
X
సుశాంత్ హీరోగా నటించిన మూవీ ఆటాడుకుందాం రా. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటల్ని తాజాగా విడుదల చేశారు. ఏఎన్నార్ సూపర్ హిట్ మూవీలోంచి పల్లెకు పోదాం..పారును చూద్దాం చలోచలో అనే పాట రీమిక్స్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. మనం సినిమాలో అక్కినేనికి చెందిన ఓ పాటను రీమిక్స్ చేసిన అనూప్ రూబెన్స్… ఆటాడుకుందాం రాలో కూడా తన రీమిక్స్ మేజిక్ ను చూపించాడు. ఇదిలా ఉండగా… తాజాగా వచ్చిన ఓ రూమర్.. .ఆటాడుకుందాం రా సినిమాను పబ్లిసిటీ పరంగా మరో పెట్టు పైకి ఎక్కించింది.
అవును.. ఈ సినిమాలో అక్కినేని బ్రదర్స్ కనిపించనున్నారట. అంటే… అఖిల్-నాగచైతన్య ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారట. చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్ కు బూస్టప్ ఇచ్చేందుకు చైతూ-అక్కీ కలిసి ఇలా గెస్ట్ రోల్స్ లో కనిపించేందుకు అంగీకరించారట. త్వరలోనే సుశాంత్-చైతూ-అఖిల్ కలిసి నటించే సన్నివేశాల్ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
First Published:  6 Aug 2016 12:31 PM GMT
Next Story