Telugu Global
Cinema & Entertainment

వియ్యంకులైన విక్రమ్, కరుణానిథి

తమిళనాడు పాపులర్ నేత కరుణానిథి, కోలీవుడ్ పాపులర్ స్టార్ విక్రమ్ వియ్యంకులయ్యారు. కరుణానిధికి వరుసకు మనవడైన మను రంజిత్, విక్రమ్ గారాల పట్టి అక్షిత నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ నిశ్చితార్థ విశేషాలు… 24 గంటలు గడిస్తే కానీ బయటకు రాకపోవడం విశేషం. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో అత్యంత గోప్యంగా, మీడియాకు తెలియకుండా ఈ వేడుకను కానిచ్చేశారు. నిశ్చితార్థానికి విక్రమ్, కరుణానిథి కుటుంబాలకు చెందిన పలువురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. […]

వియ్యంకులైన విక్రమ్, కరుణానిథి
X

తమిళనాడు పాపులర్ నేత కరుణానిథి, కోలీవుడ్ పాపులర్ స్టార్ విక్రమ్ వియ్యంకులయ్యారు. కరుణానిధికి వరుసకు మనవడైన మను రంజిత్, విక్రమ్ గారాల పట్టి అక్షిత నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ నిశ్చితార్థ విశేషాలు… 24 గంటలు గడిస్తే కానీ బయటకు రాకపోవడం విశేషం. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో అత్యంత గోప్యంగా, మీడియాకు తెలియకుండా ఈ వేడుకను కానిచ్చేశారు. నిశ్చితార్థానికి విక్రమ్, కరుణానిథి కుటుంబాలకు చెందిన పలువురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. ఇక వేడుకలో సినిమా వాసన అనేదే లేకుండా చేశాడు విక్రమ్. తన ఫేవరెట్ దర్శకుడు శంకర్ ను మినహా మరెవర్నీ వేడుకకు ఆహ్వానించలేదు. అలా వివాహ వేడుకలో సినిమా ఇండస్ట్రీ నుంచి శంకర్ మాత్రమే కనిపించాడు. కావిన్ కేర్ సంస్థకు చెందిన వ్యాపారవేత్త రంగనాథన్ కుమారుడే మను రంజిత్. ఈ కుటుంబం చాన్నాళ్లుగా విక్రమ్ కు తెలుసు. ఈ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలా అప్పుడప్పుడు కలుసునే రంజిత్, అక్షిత మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు సీక్రెట్ గానే ప్రేమించుకున్న ఈజంట…. తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమౌతున్నారు. ఎంగేజ్ మెంట్ ను గుంభనంగా కనిచ్చేసిన విక్రమ్… పెళ్లిని మాత్రం సినీప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందించనున్నారు.

First Published:  11 July 2016 10:36 PM GMT
Next Story