మనిల్లు బాగాలేకే... పొరుగింటి వైపు చూస్తున్నారు!
మనిల్లు బాగాలేకే.. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మనకు సరైన దిశా నిర్దేశం లేకనే పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుందాం. అప్పుడు పార్టీ నుంచి ఎవరూ కదిలే పరిస్థితి ఉండదు. ఈ మాటలు అన్నది ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ నంది ఎల్లయ్య. అధికార పార్టీ నేతలు మన నేతలకు తప్పుడు హామీలు ఇచ్చి ప్రలోభ పెట్టి, తీసుకెళ్తున్నారని ఆరోపించారు. సహజంగానే మీడియాకు దూరంగా […]
BY sarvi6 July 2016 9:00 PM GMT
X
sarvi Updated On: 7 July 2016 12:00 AM GMT
మనిల్లు బాగాలేకే.. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మనకు సరైన దిశా నిర్దేశం లేకనే పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుందాం. అప్పుడు పార్టీ నుంచి ఎవరూ కదిలే పరిస్థితి ఉండదు. ఈ మాటలు అన్నది ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ నంది ఎల్లయ్య. అధికార పార్టీ నేతలు మన నేతలకు తప్పుడు హామీలు ఇచ్చి ప్రలోభ పెట్టి, తీసుకెళ్తున్నారని ఆరోపించారు. సహజంగానే మీడియాకు దూరంగా ఉండే నంది ఎల్లయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఆవేదనను అధిష్టానం అర్థం చేసుకుంటుందా? లైట్ తీసుకుంటుందా? అంటూ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.
రాష్ట్రంలో పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్లు పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నంది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పట్టాయని సీనియర్ కాంగ్రెస్ నేతలతోపాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నంది మాటల్లో ఎలాంటి దోషం లేదని స్పష్టం చేస్తున్నారు. ముందు మన ఇల్లు చక్కదిద్దు కుందాం.. పార్టీకి కేంద్ర అధినాయకత్వం నుంచి సరైన మార్గనిర్దేశం లేదు… అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆయన ఆరోపించారు. అంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఎప్పటి కప్పడు అధిష్టానానికి చేరవేయడంలో ఇక్కడి నాయకులు విఫలమవుతూ వస్తున్నారన్నది ఆయన అంతంరంగంగా కనిపిస్తోంది. అందుకే, అధిష్టానం నుంచి మార్గదర్శనం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర పార్టీ కీలక నాయకుల పనితీరును ఎండగట్టేలా ఉండటంతో అధిష్టానం వీటిపై దృష్టి సారించిందని సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ పై వేటు వేసిన అధిష్టానం ఆ స్థానంలో కేరళ మాజీ సీఎం ఊమెన్ ను నియమించిన సంగతి తెలిసిందే! మరి నంది వ్యాఖ్యలతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటు చేసుకుంటాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story