Telugu Global
NEWS

పరిటాల రవిని చంపుతారని బాబుకు తెలుసు... అందుకే మీటింగ్‌లు పెట్టారు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ఆరోపణలు చేశారు. తుని విధ్వంసం సీఎం ఆదేశాలతోనే జరిగిందన్నారు. పరిటాల రవి హత్య గురించి కూడా చంద్రబాబుకు ముందే తెలుసన్నారు. అందుకే రవి హత్య జరిగిన రోజు ముందుగానే అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలను చంద్రబాబు ఏర్పాటు చేశారని ముద్రగడ చెప్పారు. రవి హత్య జరగగానే విధ్వంసం సృష్టించాలని, తగలబెట్టాలని అన్ని జిల్లాల నేతలకు చంద్రబాబు ఆదేశించారని అందుకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు.. […]

పరిటాల రవిని చంపుతారని బాబుకు తెలుసు... అందుకే మీటింగ్‌లు పెట్టారు
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ఆరోపణలు చేశారు. తుని విధ్వంసం సీఎం ఆదేశాలతోనే జరిగిందన్నారు. పరిటాల రవి హత్య గురించి కూడా చంద్రబాబుకు ముందే తెలుసన్నారు. అందుకే రవి హత్య జరిగిన రోజు ముందుగానే అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలను చంద్రబాబు ఏర్పాటు చేశారని ముద్రగడ చెప్పారు. రవి హత్య జరగగానే విధ్వంసం సృష్టించాలని, తగలబెట్టాలని అన్ని జిల్లాల నేతలకు చంద్రబాబు ఆదేశించారని అందుకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు.

నాదెండ్ల భాస్కర్‌రావు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలోనూ చంద్రబాబు ఆదేశాలతోనే విధ్వంసం జరిగిందని ముద్రగడ ఆరోపించారు. కాపుల్లో చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. కాపుల నుంచి తనను వేరుచేసేందుకు కుట్రలుచేస్తున్నారని అన్నారు. సీఎం తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన చెందారు. విజయమో వీరస్వర్గమో తేల్చుకునేందుకు తాను సిద్ధమని ముద్రగడ చెప్పారు. బుధవారం సాయంత్రంలోగా కాపులపై కేసులు ఎత్తివేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

Click on Image to Read:

tv5-survy

jaleel-khan

lokesh-kommineni

roja

anam-ramanarayana-reddy

buggana rajendranath reddy

ravanth-reddy

ganta-china-rajappa

kavitha

kcr

kodandaram

mudragaa-1123

ysrcp-chittor-mla

chandrababu-naidu

bhumana

tdp-leaders

satya-nadella

employee-murali-krishna

ashok-babu

jagan-anantapur

First Published:  7 Jun 2016 11:39 AM GMT
Next Story