Telugu Global
NEWS

వైఎస్‌ మరణానికి ముందూ ఇలాగే మాట్లాడావ్... ఏదో కుట్ర ఉంది

మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. త్వరలోనే వైసీపీ ఫినిష్ అయిపోతుందని చంద్రబాబు చెప్పడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని భూమన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ చనిపోవడానికి ముందు రోజు కూడా ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామని చంద్రబాబు అన్నారని ఇప్పుడు కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్‌ను భౌతికంగా అడ్డుతొలగించే కుట్రను చంద్రబాబు చేస్తున్నట్టుగా ఉందని భూమన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ […]

వైఎస్‌ మరణానికి ముందూ ఇలాగే మాట్లాడావ్... ఏదో కుట్ర ఉంది
X

మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. త్వరలోనే వైసీపీ ఫినిష్ అయిపోతుందని చంద్రబాబు చెప్పడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని భూమన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ చనిపోవడానికి ముందు రోజు కూడా ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామని చంద్రబాబు అన్నారని ఇప్పుడు కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారని అన్నారు.

జగన్‌ను భౌతికంగా అడ్డుతొలగించే కుట్రను చంద్రబాబు చేస్తున్నట్టుగా ఉందని భూమన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ మరణానికి ముందు రోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తాము గుర్తుపెట్టుకున్నామని అన్నారు. శరీరమంతా గుండె ధైర్యం ఉన్న జగన్‌ను ఎదుర్కోవడం చంద్రబాబు తరం కాదన్నారు. తుని ఘటన వెనుక వైసీపీ నేతల హస్తముందంటున్న చంద్రబాబుకు సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా అని సవాల్ చేశారు. ఒక్కో ఎమ్మెల్యేను 40కోట్లకు కొంటున్నారని ఆరోపించారు. అవినీతిడబ్బును చంద్రబాబు తన నాలుగు ఇళ్లలో నేలమాలిగలు తవ్వుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ బాబు సూట్‌ కేసు బాబులా తయారయ్యాడని విమర్శించారు. మహానాడు మొత్తం జగన్ నామస్మరణతో మారుమోగిందని దీని బట్టే వైసీపీ ఎంతగా విజయవంతమైందో అర్థం చేసుకోవచ్చన్నారు.

Click on Image to Read:

bhumana-sv-university

babau-paper

chandrababu-fire

TDP-Politburo-Meeting

kvp ramachandra rao,

kvp-jagan

mp-shiva-prasad

prabhakar-ramoji-rao

lokesh-pm

lokesh-mahanadu-speech

chandrababu-mahanadu-speach

YS-Jagan-NTR

ys-raja-reddy

First Published:  30 May 2016 1:44 AM GMT
Next Story