ఎన్ఐఎ అధికారి తంజిల్ భార్య మృతి...నిందితులు అరెస్టు!
దుండగుల కాల్పులకు గురై మరణించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి మహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య సైతం చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ నెల మూడో తేదీన తంజిల్ తన కుటుంబంతో పాటు ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా ఉత్తర ప్రదేశ్, బిజ్నూర్ వద్ద దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తంజిల్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య ఫర్జానా ఖాటూన్ ఈ రోజు (బుధవారం) ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. నాటి దాడిలో […]
దుండగుల కాల్పులకు గురై మరణించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి మహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య సైతం చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ నెల మూడో తేదీన తంజిల్ తన కుటుంబంతో పాటు ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా ఉత్తర ప్రదేశ్, బిజ్నూర్ వద్ద దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తంజిల్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య ఫర్జానా ఖాటూన్ ఈ రోజు (బుధవారం) ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. నాటి దాడిలో వారి ఇద్దరు పిల్లలు కారులోనే ఉన్నా తప్పించుకోగలిగారు. ఫర్జానా శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినా, ఆమె కోలుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తొలుత ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఈ దంపతులపై కాల్పులు జరిపిన వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడైన మునీర్కోసం గాలిస్తున్నారు. కుటుంబ తగాదాలు దాడికి దారితీసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరు తంజిల్ బావకు సన్నిహిత బంధువని తెలుస్తోంది.