Telugu Global
Cinema & Entertainment

దేవీని పక్కనపెట్టాడు... చరణ్ ను లైన్లోపెట్టాడు

నాన్నకు ప్రేమతో లాంటి బిగ్ హిట్ తర్వాత మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ ను హీరోగా చూపిస్తూ ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు దర్శకుడు సుకుమార్. ఈ విషయాన్ని దేవిశ్రీ కూడా కన్ ఫర్మ్ చేశాడు. ఆ ప్రాజెక్టును తనే నిర్మిస్తానంటూ దిల్ రాజు కూడా పక్కా చేశాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు చూస్తుంటే… కొన్నాళ్ల పాటు సుక్కూ దేవీని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… దేవితో కలిసి సెట్స్ పైకి వెళ్లాల్సిన సుక్కూ…. ప్రస్తుతం రామ్ చరణ్ […]

నాన్నకు ప్రేమతో లాంటి బిగ్ హిట్ తర్వాత మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ ను హీరోగా చూపిస్తూ ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు దర్శకుడు సుకుమార్. ఈ విషయాన్ని దేవిశ్రీ కూడా కన్ ఫర్మ్ చేశాడు. ఆ ప్రాజెక్టును తనే నిర్మిస్తానంటూ దిల్ రాజు కూడా పక్కా చేశాడు. కానీ ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు చూస్తుంటే… కొన్నాళ్ల పాటు సుక్కూ దేవీని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… దేవితో కలిసి సెట్స్ పైకి వెళ్లాల్సిన సుక్కూ…. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు దేవిశ్రీప్రసాద్ కూడా మ్యాజిక్ అందిస్తూ బిజీగా ఉండడంతో… దేవిప్రసాద్-సుక్కూ కాంబో సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి రాదని అర్థం అయిపోయింది. అటు సుక్కూ మాత్రం రామ్ చరణ్ ను ఎలా డిఫరెంట్ గా చూపించాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. ఆర్య, ఆర్య-2 సినిమాలతో బన్నీని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసినట్టు…. ఏదో ఒక కొత్త థీమ్ తో చెర్రీని కొత్తగా చూపించాలని సుక్కూ తహతహలాడుతున్నాడు. ప్రస్తుతానికి అతని మైండ్ లో 2 స్టోరీలైన్స్ ఉన్నాయి. వాటిని చెర్రీతో కూడా ఈమధ్యే పంచుకున్నాడట. త్వరలోనే చరణ్ సినిమాకు సంబంధించి ఓ స్టోరీలైన్ సిద్ధమౌతుంది. ఆ వెంటనే సెట్స్ పైకి కూడా వస్తుంది. ఈ గ్యాప్ లో సురేందర్ రెడ్డి సినిమాను కంప్లీట్ చేస్తాడు చెర్రీ.

First Published:  19 March 2016 8:22 PM GMT
Next Story