గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!
హైదరాబాద్, గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జార్ఘండ్కి చెందిన రాణి మిశ్రా (29) కొంతకాలంగా విప్రోలో ఉద్యోగం చేస్తూ ఇందిరానగర్లోని బాలాజీ హాస్టల్లో ఉంటున్నది. ఆమె మంగళవారం రాత్రి హాస్టల్ భవనం పైనుండి కిందపడి మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె కావాలనే పడిందా లేక ఎవరైనా తోశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. హాస్టల్ యాజమాన్యం బిల్టింగు వెనుక భాగంలో బుధవారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం […]
హైదరాబాద్, గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జార్ఘండ్కి చెందిన రాణి మిశ్రా (29) కొంతకాలంగా విప్రోలో ఉద్యోగం చేస్తూ ఇందిరానగర్లోని బాలాజీ హాస్టల్లో ఉంటున్నది. ఆమె మంగళవారం రాత్రి హాస్టల్ భవనం పైనుండి కిందపడి మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె కావాలనే పడిందా లేక ఎవరైనా తోశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. హాస్టల్ యాజమాన్యం బిల్టింగు వెనుక భాగంలో బుధవారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు రాణిమిశ్రాది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాణిమిశ్రాకు దైవభక్తి ఎక్కువని, ఎవరినీ పట్టించుకోకుండా ఒంటరిగా ఉండేదని ఆమె గురించి తెలిసిన వారు చెబుతున్నారు.