Telugu Global
Others

లీగల్‌ నోటీస్‌ " రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరం

వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే అనిత మధ్య వివాదం సమసిపోవడం లేదు. అసెంబ్లీలో తనను కించపరిచిన రోజాపై చట్టప్రకారం ముందుకెళ్తానని అనిత చెబుతున్నారు. తాజాగా రోజాపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఇప్పటికే రోజాకు లీగల్ నోటీసులు పంపినట్టు వెల్లడించారు. రోజా చేసిన వ్యాఖ్యలు తనతో పాటు తన కుటుంబానికి తీవ్ర మనోవేదనకు గురిచేశాయని అనిత అన్నారు. రోజాపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోరానని ఆమె చెప్పారు. రోజా […]

లీగల్‌ నోటీస్‌  రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరం
X

వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే అనిత మధ్య వివాదం సమసిపోవడం లేదు. అసెంబ్లీలో తనను కించపరిచిన రోజాపై చట్టప్రకారం ముందుకెళ్తానని అనిత చెబుతున్నారు. తాజాగా రోజాపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఇప్పటికే రోజాకు లీగల్ నోటీసులు పంపినట్టు వెల్లడించారు. రోజా చేసిన వ్యాఖ్యలు తనతో పాటు తన కుటుంబానికి తీవ్ర మనోవేదనకు గురిచేశాయని అనిత అన్నారు. రోజాపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోరానని ఆమె చెప్పారు. రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరమన్నారు. రోజాను జగన్‌ ఎందుకు కంట్రోల్ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు అనిత.

First Published:  26 Jan 2016 11:55 PM GMT
Next Story