Telugu Global
NEWS

ఇంత పొగరెందుకు స్వామి? వాళ్ళు కుక్కలా?

వివాదాలే ఇంటిపేరుగా పెట్టుకుని తిరిగే బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి మరోసారి తన పొగరుబోతుతనాన్ని బయటపెట్టుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా ఎప్పుడూ ఎవరో ఒకరిని దూషించడమే పనిగా పెట్టుకున్న స్వామి ఈసారి హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణంపై కామెంట్ చేశారు.. ఆందోళన చేస్తున్నవిద్యార్థులను అనకూడని మాటలు అన్నారు. ఆందోళన చేస్తున్న వారిని ”కుక్కలు”గా అభివర్ణించాడు. కమ్యూనిస్టులను తిడుతూ ఈ మాట వాడారు. ప్రధాని మోదీ ఒక వైపు రోహిత్ మరణంతో దేశం ఒక ముద్దు బిడ్డను కోల్పోయిందని అంటుంటే అదే […]

ఇంత పొగరెందుకు స్వామి? వాళ్ళు కుక్కలా?
X

వివాదాలే ఇంటిపేరుగా పెట్టుకుని తిరిగే బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి మరోసారి తన పొగరుబోతుతనాన్ని బయటపెట్టుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా ఎప్పుడూ ఎవరో ఒకరిని దూషించడమే పనిగా పెట్టుకున్న స్వామి ఈసారి హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణంపై కామెంట్ చేశారు.. ఆందోళన చేస్తున్నవిద్యార్థులను అనకూడని మాటలు అన్నారు. ఆందోళన చేస్తున్న వారిని ”కుక్కలు”గా అభివర్ణించాడు. కమ్యూనిస్టులను తిడుతూ ఈ మాట వాడారు. ప్రధాని మోదీ ఒక వైపు రోహిత్ మరణంతో దేశం ఒక ముద్దు బిడ్డను కోల్పోయిందని అంటుంటే అదే పార్టీకి చెందిన సుబ్రమణ్యంస్వామి మాత్రం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రోహిత్‌ మరణంపై పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇలా బాధ్యతారహితమైన కామెంట్స్ చేసిన సుబ్రమణ్యంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  23 Jan 2016 1:48 AM GMT
Next Story