Telugu Global
Cinema & Entertainment

నాన్నకు ప్రేమ‌తో నిర్మాత పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంప్లైంట్  ఇచ్చాడా..!

సినీ నటుడు పవన్ కల్యాణ్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మధ్య వివాదం ముదురుతోంది. అత్తారింటికి దారేది సినిమా రెమ్యునరేషన్ విషయంలో బీవీఎస్‌ఎన్ తనకు రెండు కోట్లు ఇవ్వాల్సి ఉందని పవన్ ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో మిగతా రెమ్యునరేషన్ ఇస్తానని ప్రసాద్ మాట తప్పారని ఫిర్యాదులో పవన్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును నిర్మాతల మండలికి ‘మా’ అసోసియేషన్ పంపింది. అయితే ఈ వివాదం వెనుక చాలా పెద్ద […]

నాన్నకు ప్రేమ‌తో నిర్మాత పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంప్లైంట్  ఇచ్చాడా..!
X

సినీ నటుడు పవన్ కల్యాణ్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మధ్య వివాదం ముదురుతోంది. అత్తారింటికి దారేది సినిమా రెమ్యునరేషన్ విషయంలో బీవీఎస్‌ఎన్ తనకు రెండు కోట్లు ఇవ్వాల్సి ఉందని పవన్ ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో మిగతా రెమ్యునరేషన్ ఇస్తానని ప్రసాద్ మాట తప్పారని ఫిర్యాదులో పవన్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును నిర్మాతల మండలికి ‘మా’ అసోసియేషన్ పంపింది. అయితే ఈ వివాదం వెనుక చాలా పెద్ద కథే ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అత్తారింటికి దారేది సినిమా పైరసీ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలో నిర్మాత బీవీఎస్‌ఎన్‌కు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్‌ను సినిమా రిలీజ్ తర్వాత తీసుకుంటామని మాట ఇచ్చారట. అయితే సినిమా రిలీజై ఘన విజయం సాధించినా పవన్‌కు ముట్టాల్సిన మొత్తం ముట్టలేదట. ఈ విషయంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ను పవన్ ప్రశ్నించగా నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సమయంలో చెల్లిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రేపు రిలీజవుతున్నా ఇంతవరకూ తనకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇవ్వలేదని పవన్ ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాన్నకు ప్రేమతో రిలీజయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదు కాబట్టి తనకు ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు.

First Published:  12 Jan 2016 4:02 AM GMT
Next Story