Telugu Global
CRIME

శ్రీకాళహస్తిలో అమ్మాయిని ఎరవేసి హత్యలు

అమ్మాయిని ఎరవేసి డబ్బు దోచుకుని హత్యలు చేస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అనేక విషయాలు రాబట్టారు. పది రోజుల క్రితం శ్రీకాళహస్తి ప్రశాంతి లాడ్జ్‌లో శ్రీనివాస్‌ అనే యువకుడిని చంపింది కూడా ఈ గ్యాంగేనని తేలింది. చెన్నైకు చెందిన విజయన్, సురేష్‌లు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి సత్యరాఘవన్‌ను తీసుకుని శ్రీకాళహస్తి వచ్చారు. ప్రశాంతి లాడ్జ్‌లో మకాం వేశారు. అదే లాడ్జిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ దిగారు. ఈ […]

శ్రీకాళహస్తిలో అమ్మాయిని ఎరవేసి హత్యలు
X

అమ్మాయిని ఎరవేసి డబ్బు దోచుకుని హత్యలు చేస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అనేక విషయాలు రాబట్టారు. పది రోజుల క్రితం శ్రీకాళహస్తి ప్రశాంతి లాడ్జ్‌లో శ్రీనివాస్‌ అనే యువకుడిని చంపింది కూడా ఈ గ్యాంగేనని తేలింది. చెన్నైకు చెందిన విజయన్, సురేష్‌లు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి సత్యరాఘవన్‌ను తీసుకుని శ్రీకాళహస్తి వచ్చారు. ప్రశాంతి లాడ్జ్‌లో మకాం వేశారు. అదే లాడ్జిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ దిగారు. ఈ సమయంలో టీవీ రిమోట్ పేరుతో యువతి పదేపదే శ్రీనివాస్ గదికి వెళ్లి పరిచయం పెంచుకుంది. అనంతరం అతడిని ముగ్గులోకి లాగింది.

అంతాఅయిపోయాక మిగిలిన ముఠా సభ్యులతో కలిసి శ్రీనివాస్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. డబ్బు, నగలు, సెల్‌ఫోన్ అన్నీ ఇచ్చేయాలని లేకుండా రచ్చ చేస్తానని బెదిరించింది. అయితే ఈ బెదిరింపులకు శ్రీనివాస్ భయపడలేదు. దీంతో రెచ్చిపోయిన సురేష్, విజయన్, యువతి సత్యరాఘవన్‌ ముగ్గురూ కలిసి లాడ్జ్ గదిలోనే శ్రీనివాస్‌ను కాళ్లు చేతులు కట్టేసి హత్య చేశారు. అనంతరం అతడి దగ్గర ఉన్న డబ్బు, నగలు, సెల్‌ఫోన్ తీసుకుని పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్‌లో దొరికిన ఆధారాల సాయంతో హంతకులను అరెస్ట్ చేశారు. వీరు గతంలోనూ ఇలాంటి పలు దారుణాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది.

First Published:  3 Jan 2016 11:22 PM GMT
Next Story