Telugu Global
Cinema & Entertainment

ఓకే బంగారానికి లైన్ క్లియర్ అయింది

ఓకే బంగారం సినిమాకు సంబంధించిన బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను మొన్నటివరకు తన దగ్గరే ఉంచుకున్నాడు దర్శకుడు మణిరత్నం. ఎలాగైనా ఆ సినిమాను తనే హిందీలో రీమేక్ చేయాలని భావించాడు. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇంతలో దర్శక నిర్మాత కరణ్ జోహార్ రంగంలోకి దిగాడు. మణిరత్నం దగ్గరనుంచి ఆ సినిమా హక్కులు తీసుకున్నాడు. మణిరత్నం శిష్యుడు షాహిద్ అలీని దర్శకుడిగా పరిచయం చేస్తూ…తనే ఓకే బంగారం సినిమాను నిర్మించాలని […]

ఓకే బంగారానికి లైన్ క్లియర్ అయింది
X
ఓకే బంగారం సినిమాకు సంబంధించిన బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను మొన్నటివరకు తన దగ్గరే ఉంచుకున్నాడు దర్శకుడు మణిరత్నం. ఎలాగైనా ఆ సినిమాను తనే హిందీలో రీమేక్ చేయాలని భావించాడు. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇంతలో దర్శక నిర్మాత కరణ్ జోహార్ రంగంలోకి దిగాడు. మణిరత్నం దగ్గరనుంచి ఆ సినిమా హక్కులు తీసుకున్నాడు. మణిరత్నం శిష్యుడు షాహిద్ అలీని దర్శకుడిగా పరిచయం చేస్తూ…తనే ఓకే బంగారం సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి హీరోహీరోయిన్లను కూడా కన్‌ఫర్మ్‌ చేశాడు కరణ్ జోహార్. ఓకే బంగారం హిందీ రీమేక్ లో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తారని వెల్లడించారు. అయితే రీమేక్ కు సంబంధించి మణిరత్నం దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటాడని, రెహ్మానే సంగీతం అందిస్తాడనే విషయాన్ని కూడా వెల్లడించాడు కరణ్ జోహార్. సో… సినిమా కరణ్ దే అయినప్పటికీ… మళ్లీ పాత టీం అంతా కలిసే ఓకే బంగారాన్ని తీస్తున్నారన్నమాట.
First Published:  31 Dec 2015 7:12 PM GMT
Next Story