Telugu Global
Others

రోజాపై మానసిక యుద్ధం జరుగుతోందా?

రోజాను మాత్రమే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణాలను టీడీపీ నేతలు వివరిస్తున్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు తెలివిగా తప్పించుకుని రోజాను మాత్రమే ఇరికించేశారని అర్థం వచ్చేలా మీడియా ప్రతినిధుల వద్ద టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజాకు అరవడం తప్ప ఆలోచన లేదని అందుకే దొరికిపోయారని అంటున్నారు. రోజాతో పాటు అదే స్థాయిలో సభలో నినాదాలు, విమర్శలు చేసిన మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారంటే అందుకు టీడీపీ నేతలు కారణాలు చెబుతున్నారు. […]

రోజాపై మానసిక యుద్ధం జరుగుతోందా?
X

రోజాను మాత్రమే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణాలను టీడీపీ నేతలు వివరిస్తున్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు తెలివిగా తప్పించుకుని రోజాను మాత్రమే ఇరికించేశారని అర్థం వచ్చేలా మీడియా ప్రతినిధుల వద్ద టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజాకు అరవడం తప్ప ఆలోచన లేదని అందుకే దొరికిపోయారని అంటున్నారు. రోజాతో పాటు అదే స్థాయిలో సభలో నినాదాలు, విమర్శలు చేసిన మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారంటే అందుకు టీడీపీ నేతలు కారణాలు చెబుతున్నారు.

సభ కార్యక్రమాలపై పదేపదే ఆటంకం కలిగిస్తున్న కొందరు వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు ఉండబోతున్నాయని తాము ముందే హెచ్చరించామంటున్నారు. ఈ హెచ్చరికలను అర్థం చేసుకున్నారు కాబట్టి సభలో చెవిరెడ్డి, కొడాలి, కోటం రెడ్డి లాంటి వారు శుక్రవారం సైలెంట్‌గా ఉన్నారని … రోజా మాత్రం పాత తీరులోనే ముందుకెళ్లారని అంటున్నారు. అందుకే రోజాపై మాత్రమే వేటు పడిందంటున్నారు. అయితే రోజాను ఇరికించి మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నారనే విధంగా మాట్లాడుతున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు నిజమా లేక వైసీపీలో చిచ్చుపెట్టేందుకు మరో ఎత్తుగడనా అన్నది తేలాలి.

First Published:  20 Dec 2015 8:50 AM GMT
Next Story