Telugu Global
NEWS

మోదీపై రాయపాటి ఉరుములు

మొన్నటి వరకు టీడీపీ తీరును ఏపీ బీజేపీ నేతలు పదేపదే విమర్శించేవారు. అయితే బిహార్‌లో బీజేపీ బొక్కబోర్లాపడడంతో కమలనాథులు కామ్ అయిపోయారు. ఇప్పుడు టైమింగ్‌ దొరికే సరికి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కాలు దువ్వి కవ్విస్తున్నారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్ట్‌గా మోదీపైనా అటాక్ చేశారు.  ఏపీ ప్రజల ఉసురు తగిలే బిహార్‌లో బీజేపీ మట్టికరించిందని విమర్శించారు.  బిహార్, కశ్మీర్లకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏపీకి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చి వెళ్తారా అని […]

మోదీపై రాయపాటి ఉరుములు
X

మొన్నటి వరకు టీడీపీ తీరును ఏపీ బీజేపీ నేతలు పదేపదే విమర్శించేవారు. అయితే బిహార్‌లో బీజేపీ బొక్కబోర్లాపడడంతో కమలనాథులు కామ్ అయిపోయారు. ఇప్పుడు టైమింగ్‌ దొరికే సరికి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కాలు దువ్వి కవ్విస్తున్నారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్ట్‌గా మోదీపైనా అటాక్ చేశారు. ఏపీ ప్రజల ఉసురు తగిలే బిహార్‌లో బీజేపీ మట్టికరించిందని విమర్శించారు. బిహార్, కశ్మీర్లకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏపీకి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చి వెళ్తారా అని మోదీపై రగిలిపోయారు. ఆంధ్రాకు మోదీ చేసిన మోసాన్ని బిహార్ ప్రజలు గుర్తించారని అందుకే అక్కడ బీజేపీకి బుద్ది చెప్పారని విమర్శించారు. టీడీపీ ఎంపీయే నేరుగా ఈ స్థాయిలో విమర్శలు చేయడంతో బీజేపీ, టీడీపీ మధ్య పోరు మరింత తీవ్రమైందని భావిస్తున్నారు. ఇప్పుడు సోమువీర్రాజు లాంటి బీజేపీ నేతలు వెంటనే స్పందిస్తారో లేక బిహార్‌ దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంచెం టైమ్ తీసుకుంటారో చూడాలి.

First Published:  10 Nov 2015 5:20 AM GMT
Next Story