Telugu Global
Others

బాబు వరుణ శాపగ్రస్తుడు... నా దగ్గరేముంది బోడి: జేసీ

మనసులో ఏదీ దాచుకోవడం చేతగాని జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.  అటు మోదీ ఇటు చంద్రబాబుపైనా భారీ అంచనాలతో జనం ఓట్లేశారని చెప్పారు. మోదీ ఆ అంచనాలను అందుకోలేకపోవడం వల్లే బిహార్‌లో బీజేపీ ఓడిపోయిందన్నారు. బిహార్ ఫలితాలను చంద్రబాబు కూడా గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. అది కూడా ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు.ప్రతివాడు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రాదన్న విషయంలో మోదీ, చంద్రబాబు, వెంకయ్య, […]

బాబు వరుణ శాపగ్రస్తుడు... నా దగ్గరేముంది బోడి: జేసీ
X

మనసులో ఏదీ దాచుకోవడం చేతగాని జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అటు మోదీ ఇటు చంద్రబాబుపైనా భారీ అంచనాలతో జనం ఓట్లేశారని చెప్పారు. మోదీ ఆ అంచనాలను అందుకోలేకపోవడం వల్లే బిహార్‌లో బీజేపీ ఓడిపోయిందన్నారు. బిహార్ ఫలితాలను చంద్రబాబు కూడా గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. అది కూడా ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు.ప్రతివాడు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రాదన్న విషయంలో మోదీ, చంద్రబాబు, వెంకయ్య, సుజనాచౌదరి,తనకు అందరికీ తెలుసన్నారు.

చంద్రబాబు వరుణ శాపగ్రస్తుడని జేసీ వ్యాఖ్యానించారు.వరుణుడు సహకరించపోవడమే చంద్రబాబుకు దురదృష్టమన్నారు. అందుకే ఈ రోజు చంద్రబాబు చేతులు తిరిగేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ బలపడడం అనే ప్రసక్తే లేదన్నారు. ఎప్పుడో కుళ్లిపోయిన కాంగ్రెస్‌ను పునాదుల్లో పాతిపెట్టారని జేసీ ఎద్దేవా చేశారు. ఇప్పుడు సీమ గురించి మాట్లాడుతున్న పెద్దమనుషులంతా గతంలో తాను రాయలతెలంగాణ అన్నప్పుడు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. రాయలసీమ గురించి మాట్లాడుతున్న వారంతా ప్రజల చేత తిరస్కరించబడ్డ వారేనన్నారు

అనుకున్నవన్నీ చేయడానికి చంద్రబాబు ఏమైనా దేవుడా అని ప్రశ్నించారు. అధినేతలకు నిజాలు చెప్పే వారు లేకపోవడమే నేటి రాజకీయాల్లో దురుదృష్టమన్నారు. జిల్లాలో మిమ్మల్ని కాదని చంద్రబాబు ముందుకెళ్లడం లేదట కదా అని విలేకర్లు ప్రశ్నించగా…” నాదగ్గర బోడి ఏముందని భయపడుతారు. నా దగ్గరేమైనా వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారా” అని ప్రశ్నించారు.

First Published:  9 Nov 2015 5:09 AM GMT
Next Story