Telugu Global
Others

యాగానికి సిద్ధమైన కేసీఆర్‌- ఈ టైమ్‌లో ఎందుకు?

మరోసారి చండీయాగం నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమయ్యారు.  డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్‌ జిల్లాలోని ఫాం హౌజ్‌లో ఈ యాగం నిర్వహించనున్నారు. యాగానికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు తనను ఆహ్వానించిన  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును యాగానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. దాదాపు ఐదు వేల మంది పురోహితులతో ఈ ఆయుత చండీయాగం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు యాగం నిర్వహిస్తున్నట్టు కేసీఆర్‌ […]

యాగానికి సిద్ధమైన కేసీఆర్‌- ఈ టైమ్‌లో ఎందుకు?
X

మరోసారి చండీయాగం నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమయ్యారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్‌ జిల్లాలోని ఫాం హౌజ్‌లో ఈ యాగం నిర్వహించనున్నారు. యాగానికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు తనను ఆహ్వానించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును యాగానికి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.

దాదాపు ఐదు వేల మంది పురోహితులతో ఈ ఆయుత చండీయాగం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు యాగం నిర్వహిస్తున్నట్టు కేసీఆర్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల ఎదురవుతున్న సమస్యలు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణ కుంభకోణంలో కేసీఆర్‌ను సీబీఐ విచారించిన నేపథ్యంలో అంతా మంచి జరగాలన్నది కూడా యాగం ఉద్దేశమని తెలుస్తోంది.

First Published:  24 Oct 2015 9:54 AM GMT
Next Story