Telugu Global
Others

అనంత టీడీపీలో వర్గపోరు- జేసీ నెల డెడ్‌లైన్

అనంతపురం జిల్లా టీడీపీలో నేతల మధ్య వర్గ పోరు తీవ్రమవుతోంది. ఒకరంటే మరొకరికి పడడం లేదు. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ  ప్రభాకర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం ముదిరింది . అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహం వీరి మధ్య వివాదానికి వేదికైంది. ఇటీవల క్లాక్ టవర్ వద్ద గాంధీ విగ్రహం నెలకొల్పారు. అయితే చాలా రోజులు గడుస్తున్నా విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించడం లేదు. దీనికి కారణం […]

అనంత టీడీపీలో వర్గపోరు- జేసీ నెల డెడ్‌లైన్
X

అనంతపురం జిల్లా టీడీపీలో నేతల మధ్య వర్గ పోరు తీవ్రమవుతోంది. ఒకరంటే మరొకరికి పడడం లేదు. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం ముదిరింది . అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహం వీరి మధ్య వివాదానికి వేదికైంది. ఇటీవల క్లాక్ టవర్ వద్ద గాంధీ విగ్రహం నెలకొల్పారు. అయితే చాలా రోజులు గడుస్తున్నా విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించడం లేదు. దీనికి కారణం ప్రభాకర్ చౌదరేనని జేసీ వర్గం మండిపడుతోంది.

అనంతపురం ఎంపీగా తన అన్న దివాకర్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రభాకర్ చౌదరి మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వెంటనే గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు నెల రోజుల డెడ్ లైన్ పెట్టారు ప్రభాకర్ రెడ్డి. నెల రోజుల్లోగా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే తానే స్వయంగా వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించి వేడి పుట్టించారు. దీంతో ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం ఎంతదూరం వెళ్తుందోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. గాంధీ విగ్రహాన్ని వెంటనే ఆవిష్కరించాలని ప్రజాసంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

First Published:  23 Oct 2015 12:27 AM GMT
Next Story