Telugu Global
Others

టీడీపీ తో మాకేంటి...! కావూరి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ మధ్య పైకి పొత్తు కనిపిస్తున్నా కింద స్థాయిలో మాత్రం సైకిల్‌ బ్యాచ్, కమలదండు కారాలు మిరియాలు, కత్తులు నూరుతున్నాయి. తాజాగా మరోసారి మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు టీడీపీ తీరుపై బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ కార్యకర్తల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఏపీలో బీజేపీ బలపడడం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇష్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలకు వేల […]

టీడీపీ తో మాకేంటి...! కావూరి సంచలన వ్యాఖ్యలు
X

టీడీపీ, బీజేపీ మధ్య పైకి పొత్తు కనిపిస్తున్నా కింద స్థాయిలో మాత్రం సైకిల్‌ బ్యాచ్, కమలదండు కారాలు మిరియాలు, కత్తులు నూరుతున్నాయి. తాజాగా మరోసారి మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు టీడీపీ తీరుపై బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ కార్యకర్తల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.

ఏపీలో బీజేపీ బలపడడం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇష్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలకు వేల కోట్ల నిధులు వస్తుంటే… వాటిలో ఒక్క రూపాయి కూడా బీజేపీ కార్యకర్తలకు గానీ ఇతర పార్టీల వారికి గానీ దక్కకుండా టీడీపీ వాళ్లే తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అర్హులకు కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తలకే వర్తింప చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం పార్టీ పరంగా నడుస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు పార్టీకతీతంగా అర్హులకు అందాల్సి ఉన్నా ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని కావూరి రుసరుసలాడారు. .

First Published:  5 Oct 2015 11:39 AM GMT
Next Story