Telugu Global
Others

ఉగ్రవాదంపై అంతిమ విజయం భారత్‌దే: రాజ్‌నాథ్

అనేక సవాళ్ళను విసురుతున్న ఉగ్రవాదంలో అంతిమ విజయం భారత్‌దేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌ ఇరాన్ సిరియా (ఐసీస్‌) భారత్‌లోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న విషయాన్ని విలేకరులు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా, దీనిపై స్పందించిన ఆయన అలాంటిదేమీ లేదని, ఐసిస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధీటుగా ఎదుర్కొనే సత్తా […]

అనేక సవాళ్ళను విసురుతున్న ఉగ్రవాదంలో అంతిమ విజయం భారత్‌దేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌ ఇరాన్ సిరియా (ఐసీస్‌) భారత్‌లోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న విషయాన్ని విలేకరులు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా, దీనిపై స్పందించిన ఆయన అలాంటిదేమీ లేదని, ఐసిస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని ఆయన తెలిపారు.

First Published:  26 Sep 2015 1:08 PM GMT
Next Story