Telugu Global
Others

ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. తొమ్మిది మార్గాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు గణనాథులను తీసుకురావచ్చని, ఈ మార్గాలను సీనియర్ ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 23 వేల మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే […]

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. తొమ్మిది మార్గాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు గణనాథులను తీసుకురావచ్చని, ఈ మార్గాలను సీనియర్ ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 23 వేల మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే విగ్రహాలను తరలించాలని కమిషనర్ సూచించారు.

First Published:  25 Sep 2015 1:12 PM GMT
Next Story