Telugu Global
Others

ఢిల్లీలో కాంగ్రెస్ ‘మహా కిసాన్ ర్యాలీ'

రైతు సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ‘మహా కిసాన్ ర్యాలీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ చెప్పేదొకటి చేసేదొకటని అన్నారు. ఇది రైతుల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటమని తెలిపారు. కాంగ్రెస్ రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. […]

రైతు సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ‘మహా కిసాన్ ర్యాలీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ చెప్పేదొకటి చేసేదొకటని అన్నారు. ఇది రైతుల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటమని తెలిపారు. కాంగ్రెస్ రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రైతులు ఈ ర్యాలీకి హాజరయ్యారు.
First Published:  19 Sep 2015 1:05 PM GMT
Next Story