Telugu Global
Others

మరో ధర్నాకు పవన్‌కళ్యాణ్‌ సిద్ధం..!

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల విడుదలచేసిన నిర్భంద తమిళం జీవో వల్ల తమిళనాడులో నివసిస్తున్న లక్షలాదిమంది తెలుగువిద్యార్ధులు ఇక తెలుగుభాషకు దూరంకానున్నారు. దీనిపై తమిళనాడులోని తెలుగు సంఘాలు నిరసనకు దిగాయి. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో ధర్నా కూడా చేసారు. పలువురు తెలుగు ప్రముఖులను కలుసుకొని ఈ అన్యాయాన్ని ఎదిరించాల్సిందిగా అభ్యర్ధించాడు. పలువురు దీనికి ప్రతిస్పందించి తమినాడు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసారు. ఇప్పుడు సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ తమిళనాడులోని తెలుగువిద్యార్ధులకు సంఘీభావంగా […]

మరో ధర్నాకు పవన్‌కళ్యాణ్‌ సిద్ధం..!
X

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల విడుదలచేసిన నిర్భంద తమిళం జీవో వల్ల తమిళనాడులో నివసిస్తున్న లక్షలాదిమంది తెలుగువిద్యార్ధులు ఇక తెలుగుభాషకు దూరంకానున్నారు. దీనిపై తమిళనాడులోని తెలుగు సంఘాలు నిరసనకు దిగాయి. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో ధర్నా కూడా చేసారు. పలువురు తెలుగు ప్రముఖులను కలుసుకొని ఈ అన్యాయాన్ని ఎదిరించాల్సిందిగా అభ్యర్ధించాడు. పలువురు దీనికి ప్రతిస్పందించి తమినాడు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసారు.
ఇప్పుడు సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ తమిళనాడులోని తెలుగువిద్యార్ధులకు సంఘీభావంగా హోసూరులో ఈ నెలాఖరున ధర్నా చేయాలని నిర్ణయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ధర్నా అనంతరం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలుసుకొని ఈ సమస్యపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అక్కడా పరిష్కారం కాకపోతే ప్రధాని మోడీని కలిసి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతారని తెలుస్తోంది.

First Published:  16 Sep 2015 5:35 AM GMT
Next Story