Telugu Global
Others

ఇంటిపన్ను స్వాహా చేసిన ఆరుగురు ఉద్యోగులపై వేటు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులను అవినీతి ఆరోపణలతో నగర పాలక కమిషనర్ అనురాధ సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను డిస్మిస్ చేసి, ముగ్గురు పర్యవేక్షణాధికారులకు చార్జి మెమోలు ఇచ్చారు. గుంటూరు కార్పొరేషన్‌లో సుమారు కోటి రూపాయల ఆస్తి పన్నును సొంతానికి వాడేసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో కమిషనర్ ఇద్దరు ఉన్నతాధికారులతో రహస్య విచారణ జరిపించారు. సొమ్మును వాడుకున్నట్టు విచారణలో తేలడంతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులను అవినీతి ఆరోపణలతో నగర పాలక కమిషనర్ అనురాధ సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను డిస్మిస్ చేసి, ముగ్గురు పర్యవేక్షణాధికారులకు చార్జి మెమోలు ఇచ్చారు. గుంటూరు కార్పొరేషన్‌లో సుమారు కోటి రూపాయల ఆస్తి పన్నును సొంతానికి వాడేసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో కమిషనర్ ఇద్దరు ఉన్నతాధికారులతో రహస్య విచారణ జరిపించారు. సొమ్మును వాడుకున్నట్టు విచారణలో తేలడంతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
First Published:  9 Sep 2015 1:20 PM GMT
Next Story