ఆ తల్లి బిడ్డలమే మేము: ఆరెస్సెస్పై వెంకయ్య
ఆర్ఎస్ఎస్ రాజ్యాంగేతర శక్తి కాదని, తమకు మాతృమూర్తితో సమానమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. కేంద్ర మంత్రులు రాజ్యాంగ ప్రమాణాలను ఉల్లంఘించి ఆర్ఎస్ఎస్తో భేటీ అవుతున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. జాతీయ భావాలు ఉన్న ఆర్.ఎస్.ఎస్తో సంప్రదింపులు చేస్తే తప్పేంటని వెంకయ్య ప్రశ్నించారు. గతంలో యుపిఎ హాయంలో ప్రదాని నివాసంలో కాకుండా సోనియా నివాసంలో కీలకమైన నిర్ణయాలు జరిగేవని, సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. […]
BY sarvi6 Sep 2015 12:53 AM GMT
X
sarvi Updated On: 6 Sep 2015 12:53 AM GMT
ఆర్ఎస్ఎస్ రాజ్యాంగేతర శక్తి కాదని, తమకు మాతృమూర్తితో సమానమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. కేంద్ర మంత్రులు రాజ్యాంగ ప్రమాణాలను ఉల్లంఘించి ఆర్ఎస్ఎస్తో భేటీ అవుతున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. జాతీయ భావాలు ఉన్న ఆర్.ఎస్.ఎస్తో సంప్రదింపులు చేస్తే తప్పేంటని వెంకయ్య ప్రశ్నించారు. గతంలో యుపిఎ హాయంలో ప్రదాని నివాసంలో కాకుండా సోనియా నివాసంలో కీలకమైన నిర్ణయాలు జరిగేవని, సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఒక ఆర్డినెన్స్ కాపీని రాహుల్ గాందీ చించి వేశాడని వెంకయ్య చెబుతూ బిజెపి అలా చేయడం లేదని, తమకు తల్లి వంటి ఆర్ఎస్ఎస్ వద్దకు వెళుతున్నామని, తల్లి వద్దకు పిల్లలు వెళితే తప్పేమిటని వెంకయ్య ప్రశ్నించారు.
Next Story