Telugu Global
Others

బస్‌స్టాండులో హృదయ విదారక దృశ్యం!

మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో పసిబిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ప్రయివేటు ఆస్పత్రిలోనే చనిపోయింది. ఆమె శవాన్ని, పసికందును నిర్లక్ష్యంగా ఆస్పత్రివర్గాలు వదిలివేయడంతో చూపరులను కదిలించి వేసింది. ఈలోగా భర్త అక్కడికి వచ్చి భార్య చనిపోయిందని తెలుసుకుని, బిడ్డతోపాటు భార్య శవాన్ని తీసుకుని హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ బస్‌స్టాండ్‌కు చేరాడు. అతని దగ్గరున్న డబ్బులు అక్కడి వరకు ప్రయాణం చేయడానికే సరిపోయాయి. అక్కడి నుంచి సొంతూరు ఊట్కూరు చేరడానికి డబ్బులు లేవు. […]

మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో పసిబిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ప్రయివేటు ఆస్పత్రిలోనే చనిపోయింది. ఆమె శవాన్ని, పసికందును నిర్లక్ష్యంగా ఆస్పత్రివర్గాలు వదిలివేయడంతో చూపరులను కదిలించి వేసింది. ఈలోగా భర్త అక్కడికి వచ్చి భార్య చనిపోయిందని తెలుసుకుని, బిడ్డతోపాటు భార్య శవాన్ని తీసుకుని హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ బస్‌స్టాండ్‌కు చేరాడు. అతని దగ్గరున్న డబ్బులు అక్కడి వరకు ప్రయాణం చేయడానికే సరిపోయాయి. అక్కడి నుంచి సొంతూరు ఊట్కూరు చేరడానికి డబ్బులు లేవు. బుధవారం సార్వత్రిక బంద్‌ జరగడంతో ఏం చేయాలో తెలియక అక్కడే పడిగాపులు కాశాడు. పుట్‌పాత్ మీద ఆమె శవం పక్కనే పసికందు, ఇద్దరు పిల్లలతో తండ్రి బేల చూపులు చూస్తూ కన్నీరు పెట్టడం పలువురిని కంటతడి పెట్టించింది. పసికందును పిల్లాడు ఒళ్లో పెట్టుకొని జోకొడుతున్న దృశ్యం చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది, స్థానికులు అతనికి కొంత ఆర్థిక సాయం చేసి అక్కడి నుంచి ఊట్కూరుకు ఆటోలో పంపారు. అసలు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం, శవాన్ని పోస్టుమార్టం చేయకుండా వదిలి వేయడంపై హైదరాబాద్‌లో పోలీసులు ఆరా తీస్తున్నారు.
First Published:  2 Sep 2015 1:01 PM GMT
Next Story