Telugu Global
Others

ఏపీలో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌: హరిబాబు

వైజాగ్‌- చెన్నైలో ఇండస్ర్టియల్‌ క్యారిడార్‌తోపాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్‌ వాటర్‌వే -4 గా ప్రకటించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 10 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న ఓడలు ఈ వాటర్‌వే ద్వారా ప్రయాణించేందుకు అనుమతి జారీ చేశామన్నారు. దుగరాజపట్నం పోర్టు స్థల సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. ఈ పోర్టును త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు […]

వైజాగ్‌- చెన్నైలో ఇండస్ర్టియల్‌ క్యారిడార్‌తోపాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్‌ వాటర్‌వే -4 గా ప్రకటించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 10 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న ఓడలు ఈ వాటర్‌వే ద్వారా ప్రయాణించేందుకు అనుమతి జారీ చేశామన్నారు. దుగరాజపట్నం పోర్టు స్థల సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. ఈ పోర్టును త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ర్టానికి ప్రత్యేక రైల్వే జోన్‌కు సంబంధించి కూడా కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని, ఈ విషయమై అనుమానాలు అక్కర్లేదని, కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాయని హరిబాబు అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు బీజేపీ ఎదుగుదలకు అడ్డుకాబోదన్నారు. పొత్తు ఉన్నా రాష్ట్రంలోని 175 స్థానాలలో సొంతంగా ఎదిగేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
First Published:  2 Sep 2015 1:12 PM GMT
Next Story