Telugu Global
Others

టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌

జగన్‌ దీక్షతో ఏపీకి ప్రత్యేక హోదా రాదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. చట్టప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అయినా అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని , హామీ నెరవేర్చకుంటే ప్రజల్లో బీజేపీ నమ్మకం కోల్పోయే అవకాశముందన్నారు. టీడీపీలో చేరడం వెనుక తన దైవం రోశయ్య ఆశీస్సులున్నాయన్నారు. ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా […]

జగన్‌ దీక్షతో ఏపీకి ప్రత్యేక హోదా రాదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. చట్టప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అయినా అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని , హామీ నెరవేర్చకుంటే ప్రజల్లో బీజేపీ నమ్మకం కోల్పోయే అవకాశముందన్నారు. టీడీపీలో చేరడం వెనుక తన దైవం రోశయ్య ఆశీస్సులున్నాయన్నారు. ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల్లో మంచి అభిమానం ఉన్న వ్యక్తి టీడీపీలో చేరడం సంతోషదాయకమని, ఆయనను టీడీపీ కుటుంబ సభ్యునిగా చూసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ర్టానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిపనులు చూసి పార్టీలో చేరానని, ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారని, అహర్నిషలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు.
First Published:  1 Sep 2015 1:42 PM GMT
Next Story