Telugu Global
Others

మ‌హిళ‌పై  గ్యాంగ్‌రేప్ ?

న‌లుగురు  వ్య‌క్తులు త‌న‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డార‌ని ఓ వివాహిత  నిజామాబాద్ పోలీస్ స్టేష‌న్లో  ఫిర్యాదు చేసింది. భ‌ర్త‌తో క‌లిసి ఆదివారం రాత్రి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్‌కు చేరుకున్నామని, అర్థ‌రాత్రి కావ‌డంతో బోధ‌న్‌కు వెళ్లేందుకు వాహ‌నాలు లేక స్టేషన్లోనే ఉన్నామ‌ని ఆమె చెప్పింది. ఆక‌లి తీర్చుకోవ‌డానికి రైల్వేస్టేష‌న్ నుంచి బైట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో న‌లుగురు యువ‌కులు త‌న భ‌ర్త‌ను క‌త్తితో బెదిరించి త‌న‌పై సామూహిత అత్యాచారానికి పాల్ప‌డ‌డంతోపాటు త‌మ వ‌ద్ద‌నున్న రూ. 1600ల‌ను దోచుకున్నార‌ని ఆమె ఫిర్యాదు చేసింది. […]

మ‌హిళ‌పై  గ్యాంగ్‌రేప్ ?
X
న‌లుగురు వ్య‌క్తులు త‌న‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డార‌ని ఓ వివాహిత నిజామాబాద్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది. భ‌ర్త‌తో క‌లిసి ఆదివారం రాత్రి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్‌కు చేరుకున్నామని, అర్థ‌రాత్రి కావ‌డంతో బోధ‌న్‌కు వెళ్లేందుకు వాహ‌నాలు లేక స్టేషన్లోనే ఉన్నామ‌ని ఆమె చెప్పింది. ఆక‌లి తీర్చుకోవ‌డానికి రైల్వేస్టేష‌న్ నుంచి బైట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో న‌లుగురు యువ‌కులు త‌న భ‌ర్త‌ను క‌త్తితో బెదిరించి త‌న‌పై సామూహిత అత్యాచారానికి పాల్ప‌డ‌డంతోపాటు త‌మ వ‌ద్ద‌నున్న రూ. 1600ల‌ను దోచుకున్నార‌ని ఆమె ఫిర్యాదు చేసింది. వివాహిత ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఇద్దరు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌రో ఇద్ద‌రి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
First Published:  24 Aug 2015 1:15 PM GMT
Next Story