Telugu Global
Others

అప్పులు బాధతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

కరువు జిల్లా అనంతపురంలో రైతులు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోరంట్ల మండలం పుడిగుండ్లపల్లి గ్రామంలో అప్పులు బాధ భరించలేక వృద్ధ దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. నంజిరెడ్డి, అతని భార్య నంజమ్మ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు… వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అప్పటికే భర్త నంజిరెడ్డి చనిపోయారు. భార్య నంజమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో…హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతిచెందింది. 

కరువు జిల్లా అనంతపురంలో రైతులు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోరంట్ల మండలం పుడిగుండ్లపల్లి గ్రామంలో అప్పులు బాధ భరించలేక వృద్ధ దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. నంజిరెడ్డి, అతని భార్య నంజమ్మ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు… వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అప్పటికే భర్త నంజిరెడ్డి చనిపోయారు. భార్య నంజమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో…హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతిచెందింది.
First Published:  19 Aug 2015 1:30 PM GMT
Next Story