Telugu Global
Others

మళ్ళీ దొరికిన గంజాయి కేసు నిందితులు

నెల్లూరు జిల్లా దొరవారిసత్రంలో గతనెల 7వ తేదిన గంజాయి కేసులో పట్టుబడి తప్పించుకున్న ఇద్దరు నైజీరియన్లు, మరో స్మగ్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరిని ఇంతకుముందు పట్టుకోగా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుపోయారు. వీరిని చాకచక్యంగా తమిళనాడులో అరెస్ట్ చేశారు.‌ వీరు నకిలీ వీసాలతో భారత్‌లో ఉంటున్నట్లు కనుగొన్నారు. గత రెండు సంవత్సరాలుగా వీరు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారని, వీరు దీనిని వృత్తిగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. 

నెల్లూరు జిల్లా దొరవారిసత్రంలో గతనెల 7వ తేదిన గంజాయి కేసులో పట్టుబడి తప్పించుకున్న ఇద్దరు నైజీరియన్లు, మరో స్మగ్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరిని ఇంతకుముందు పట్టుకోగా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుపోయారు. వీరిని చాకచక్యంగా తమిళనాడులో అరెస్ట్ చేశారు.‌ వీరు నకిలీ వీసాలతో భారత్‌లో ఉంటున్నట్లు కనుగొన్నారు. గత రెండు సంవత్సరాలుగా వీరు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారని, వీరు దీనిని వృత్తిగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
First Published:  13 Aug 2015 1:16 PM GMT
Next Story