Telugu Global
NEWS

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే 11న రాష్ట్ర బంద్: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలోని కావలికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాపై మాట మార్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. కేంద్రమంత్రులను రాష్ట్రంలో తిరగనివ్వమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే 11న రాష్ట్ర బంద్: రామకృష్ణ
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలోని కావలికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాపై మాట మార్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. కేంద్రమంత్రులను రాష్ట్రంలో తిరగనివ్వమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
First Published:  7 Aug 2015 1:09 AM GMT
Next Story