Telugu Global
Others

గ్రామాల్లో చెత్త‌ ఎత్తివేతకు 25 వేల రిక్షాలు

చెత్త తొల‌గింపు వ‌ల్ల‌నే గ్రామాలు స్వ‌చ్చంగా ఉంటాయ‌ని అందుకోసం  25 వేల రిక్షాలు కొనుగోలు చేసి జ‌నాభా ప్రాతిప‌దిక‌న గ్రామాల‌కు పంపిణీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 17న అన్ని గ్రామాల్లోనూ గ్రామ‌జ్యోతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని, అందులో భాగంగా విధిగా గ్రామ‌స‌భలు నిర్వ‌హించాల‌ని, రాబోయే నాలుగేళ్ల కోసం ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఆ ప్ర‌ణాళిక‌లు అనుస‌రించి గ్రామాల‌కు నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని, ఏ గ్రామానికి ఎంత నిధులు విడుద‌ల […]

చెత్త తొల‌గింపు వ‌ల్ల‌నే గ్రామాలు స్వ‌చ్చంగా ఉంటాయ‌ని అందుకోసం 25 వేల రిక్షాలు కొనుగోలు చేసి జ‌నాభా ప్రాతిప‌దిక‌న గ్రామాల‌కు పంపిణీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 17న అన్ని గ్రామాల్లోనూ గ్రామ‌జ్యోతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని, అందులో భాగంగా విధిగా గ్రామ‌స‌భలు నిర్వ‌హించాల‌ని, రాబోయే నాలుగేళ్ల కోసం ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఆ ప్ర‌ణాళిక‌లు అనుస‌రించి గ్రామాల‌కు నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని, ఏ గ్రామానికి ఎంత నిధులు విడుద‌ల చేసారో ప్ర‌జ‌ల‌కు తెలపాల‌ని ఆయ‌న అధికారుల‌ను కోరారు.
First Published:  5 Aug 2015 1:09 PM GMT
Next Story