కుప్పకూలిన భవనం... 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని ధానే జిల్లాలోని థక్రులీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనంలో 20 కుటుంబాలు నివసిస్తున్నాయని శిధిలాల కింద మరికొంత మంది క్షతగాత్రులు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శిధిలాలను తొలగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు వర్షం అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల […]
BY sarvi29 July 2015 1:07 PM GMT
sarvi Updated On: 30 July 2015 1:17 AM GMT
మహారాష్ట్రలోని ధానే జిల్లాలోని థక్రులీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనంలో 20 కుటుంబాలు నివసిస్తున్నాయని శిధిలాల కింద మరికొంత మంది క్షతగాత్రులు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శిధిలాలను తొలగించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు వర్షం అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story