Telugu Global
Others

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదుల దాడి

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. బుధవారం అనంతనాగ్‌ – పహల్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, మరో ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. బుధవారం అనంతనాగ్‌ – పహల్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, మరో ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
First Published:  28 July 2015 1:19 PM GMT
Next Story