Telugu Global
Others

విశాఖలో ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

విశాఖ జిల్లా ఎస్‌ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో… ఇద్ద‌రు ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న మ‌రో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుష్కర యాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చికిత్స పొందుతున్న […]

విశాఖ జిల్లా ఎస్‌ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో… ఇద్ద‌రు ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న మ‌రో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుష్కర యాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చికిత్స పొందుతున్న బాధితులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరంతా శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లాకు చెందిన వారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
First Published:  14 July 2015 1:12 PM GMT
Next Story