Telugu Global
Others

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం" అమూల్య" 

ప్రీ పెయిడ్‌ కొత్త కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌  ఏపీ సర్కిల్లో  “అమూల్య” అనే పథకాన్ని ప్రారంభించింది. శనివారం నుంచి  ప్రారంభమయ్యే  ఈ స్కీంలో సర్వీస్‌ ట్యాక్స్‌తో కలిపి  రూ. 51 వసూలు చేస్తారు. లోకల్‌, ఎస్‌టీడీ, ఏదేనీ నెట్‌ కాల్స్‌పై సెకనుకు కేవలం ఒక పైసా మాత్రమే చార్జీ విధిస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ నిమిషానికి 20 పైసలే వసూలు చేస్తారు. వినియోగదారుడు లోకల్‌, ఎస్‌టీడీ ఎస్‌ఎంఎస్‌లపై 40 పైసలు […]

ప్రీ పెయిడ్‌ కొత్త కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్లో “అమూల్య” అనే పథకాన్ని ప్రారంభించింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ స్కీంలో సర్వీస్‌ ట్యాక్స్‌తో కలిపి రూ. 51 వసూలు చేస్తారు. లోకల్‌, ఎస్‌టీడీ, ఏదేనీ నెట్‌ కాల్స్‌పై సెకనుకు కేవలం ఒక పైసా మాత్రమే చార్జీ విధిస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ నిమిషానికి 20 పైసలే వసూలు చేస్తారు. వినియోగదారుడు లోకల్‌, ఎస్‌టీడీ ఎస్‌ఎంఎస్‌లపై 40 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్లో లభించే సంస్థ టాప్‌ అప్‌ రీచార్జీలపై ఫుల్‌ టాక్‌టైం లభిస్తుంది. శనివారం నుంచి నెల రోజుల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ స్కీం అందుబాటులో ఉండనుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వెల్లడించారు.
First Published:  10 July 2015 1:05 PM GMT
Next Story