చంద్రబాబు దుర్మార్గపు నాయకుడు: జగన్
కుమార్తెని దుర్భాషలాడుతుంటే అడ్డుకున్న తండ్రిపై కేసు పెడతారా? ఇదెక్కడి న్యాయం… అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న కూతురు అఖిలప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుంటే అదేమిటని ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నెట్టి వేశారని, ‘డోంట్ టచ్ మీ’ అన్నందుకు కేసు పెట్టి బెయిలు కూడా రాకుండా హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించడానికి వచ్చిన జగన్ మాట్లాడుతూ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ […]
BY sarvi7 July 2015 6:12 AM GMT
X
sarvi Updated On: 7 July 2015 6:29 AM GMT
కుమార్తెని దుర్భాషలాడుతుంటే అడ్డుకున్న తండ్రిపై కేసు పెడతారా? ఇదెక్కడి న్యాయం… అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న కూతురు అఖిలప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుంటే అదేమిటని ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నెట్టి వేశారని, ‘డోంట్ టచ్ మీ’ అన్నందుకు కేసు పెట్టి బెయిలు కూడా రాకుండా హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించడానికి వచ్చిన జగన్ మాట్లాడుతూ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, ఇంకా బీపీతోను, షుగర్తోను బాధ పడుతున్నారని, హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్ళమని వైద్యులు సూచించినా కర్నూలు ఆస్పత్రిలోనే ఉంచారని ఆయన అన్నారు. అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రంలో ఉందని అంటున్నారని, చంద్రబాబుకు ఓటర్కార్డు, ఆధార్ కార్డు అక్కడే ఉన్నాయని, మరి అక్కడి నుంచి పరిపాలన సాగించడం లేదా అని జగన్ ప్రశ్నించారు. అక్రమంగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఎప్పుడూ టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని జగన్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ విలువలకు పాతరేసి లంచాల సొమ్ముతో ఎమ్మెల్సీలకు ఓట్లు కొనిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని, ఇంత దుర్మార్గపు నాయకుడు మరొకరు ఉండరని జగన్ విమర్శించారు.
Next Story