Telugu Global
Others

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న పొడిగింపు

విశాఖ‌ప‌ట్ట‌ణం, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఈ నెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ప‌ర్య‌ట‌న మ‌రో రోజు పొడిగించిన‌ట్లు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ త‌ల‌శిల ర‌ఘురాం  ప్ర‌క‌టించారు. మొద‌ట 2వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో, 3వ తేదీలో తూర్పు గోదావ‌రిలో ప‌ర్య‌టించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని, అయితే ఇప్పుడు అద‌నంగా 4వ తేదీ ప‌శ్చిమ గోదావ‌రిలో కూడా ప‌ర్య‌టించాల‌ని నిర్ణయం తీసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. జూన్ 2న ఉద‌యం విశాఖ‌ప‌ట్నం […]

విశాఖ‌ప‌ట్ట‌ణం, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఈ నెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న మ‌రో రోజు పొడిగించిన‌ట్లు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ త‌ల‌శిల ర‌ఘురాం ప్ర‌క‌టించారు. మొద‌ట 2వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో, 3వ తేదీలో తూర్పు గోదావ‌రిలో ప‌ర్య‌టించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని, అయితే ఇప్పుడు అద‌నంగా 4వ తేదీ ప‌శ్చిమ గోదావ‌రిలో కూడా ప‌ర్య‌టించాల‌ని నిర్ణయం తీసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. జూన్ 2న ఉద‌యం విశాఖ‌ప‌ట్నం చేరుకుని య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం నుండి త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించి 4 వ తేదీ ప‌శ్చిమ గోదావ‌రిలోని గోపాల‌వ‌ర్గం నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌తో పూర్తి చేస్తారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారి కుటుంబ‌స‌భ్యుల‌ను, వాయుగుండంలో గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శిస్తారని ర‌ఘురాం పేర్కొన్నారు.

First Published:  30 Jun 2015 1:14 PM GMT
Next Story